KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానాలు విధించారు. పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
W.G: జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.140 కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
నెల్లూరు డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ లేఅవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు, కావలి మున్సిపల్ కమిషనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు.
ASR: జీవో నెంబర్ 60 రద్దు చేయాలని కొయ్యూరు మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధి అధికారులు కోరారు. మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల సమాఖ్య మండల యూనియన్ తరపున ఎంపీడీవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్-60 వల్ల రాష్ట్రంలో సుమారు 6,166 మంది పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జీతం స్కేల్ రూ.28,280 నుంచి రూ.25,220 కి మార్పు చేయడం తగదన్నారు.
SKLM: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు. ధర్నాల పేరు తో వైసీపీ నేతలు గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు పేర్కొన్నారు.
SS: హిందూపురంలోని సరిగమ ఫంక్షన్ హాల్లో జిల్లా YCP మహిళా నేతలు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో MLC వరుదు కల్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయమనోహరి, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా విభాగం బలోపేతం, పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ATP: అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల వార్డుల పునర్విభజన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాలు ప్రస్తుతం జనగణన విధుల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ఈ నెల 26 వరకు గడువును అధికారులు పొడిగించారు.
ప్రకాశం: ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభంలో ఫీల్డ్ పరిశీలన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రచారి, ఇరిగేషన్ శాఖ DE, AE, డిప్యూటీ MPDO, APOతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని సమీక్షించి, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు బుధవారం ములకలూరులో పర్యటించారు. తడి, పొడి చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. తడి చెత్త ఎరువుతో భూసారం, పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం ప్రజలు తప్పనిసరిగా చెత్తను వేరుచేసి సిబ్బందికి ఇవ్వాలని ఆయన సూచించారు.
E.G: నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడిసిన్ స్టోర్ రూమ్లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో రోగుల వార్డుకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
W.G: సిద్ధాంతం వీఆర్వో కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలపై తహశీల్దార్ అనిత కుమారి నిన్న సమీక్ష నిర్వహించారు. రీసర్వే ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. రైతులు సమర్పించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాస్ పుస్తకాలు జారీ చేయాలని సూచించారు.
PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు, సేవల వివరాలను ఈ నెల 15న తప్పని సరిగా నమోదు చేయాలని డిఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులకు చెప్పారు. సేవల రూపంలో మాత్రమే సహకారం అందించాలన్నారు.
ప్రకాశం: కొనకలమిట్ల మండలం సిద్దవరం సమీపంలో ఇవాళ అడవి పంది అడ్డురాగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదారకట్లకు చెందిన కూలీలు మిరపకాయల కోతకు కొత్తపల్లి వెళ్లే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలోని వారికి స్వల్ప గాయాలు తప్ప పెద్ద ప్రమాదం లేదని సమాచారం.
KDP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఆర్ పెండింగ్ పనులపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ డా.శ్రీధర్ సమీక్షించారు. JC నిధి మీనా, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం, పునరావాస పంపిణీలో అస్సలు జాప్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోవాలన్నారు.
KDP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఆర్ పెండింగ్ పనులపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ డా.శ్రీధర్ సమీక్షించారు. JC నిధి మీనా, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం, పునరావాస పంపిణీలో అస్సలు జాప్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోవాలన్నారు.