• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ఇవాళ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం పట్టణంలో జరుగుతున్న అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమని సీఐ వెంకట చలపతి తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా, మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 16, 2026 / 06:24 AM IST

లారీని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

ప్రకాశం: త్రిపురాంతకం (M) రాజుపాలెం BTC కాలనీ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెంకు చెందిన శివన్నారాయణ బైక్‌పై మార్కాపురం నుంచి రాజుపాలెం వస్తుండగా.. రోడ్డుపై మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉన్న లారీని వెనుక భాగాన ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 16, 2026 / 06:15 AM IST

లోకేష్‌కి కీలక పదవి రావడంపై సంబరాలు

ATP: మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు అనంతపురం నేతలు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

April 16, 2026 / 06:04 AM IST

నేటి నుంచే జనగణన.. స్వీయ గణనకు అవకాశం

విజయనగరం: జనగణనలో భాగంగా స్వీయ గణన సౌకర్యం నేటి నుంచి ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి OTP ద్వారా నమోదు చేసి, 34 ప్రశ్నలతో తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే రిఫరెన్స్ ఐడీని ఎన్యూమరేటరు ఇవ్వాలని తెలిపారు.

April 16, 2026 / 05:55 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి (M) రాజపురం ఉపకేంద్రంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. కవిటి, రాజపురం తదితర గ్రామాలలో ఉ. 9 గంటల నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

April 16, 2026 / 04:50 AM IST

రైతుల సంక్షేమమే లక్ష్యం: DCCB ఛైర్మన్

VZM: సహకార రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కూటమి ప్రబుత్వ లక్ష్యమని జిల్లా DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన APCOB జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం మరింత పారదర్శక, సమర్థవంతమైన సేవలు అందించేందుకు ప్రబుత్వ కట్టుబడి ఉందని తెలిపారు.

April 15, 2026 / 10:00 PM IST

ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసిన నూతన డీఎస్పీ

SKLM: పలాస కాశీబుగ్గ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. భవాని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా శావల దేవదత్

NTR: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా శావల దేవదత్‌ను బుధవారం నియమించింది. ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అయితే అధిష్టానం వ్యవసాయ రంగా అభివృద్ధికి చేస్తున్న కృషికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహానికి కృషి చేస్తామన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

‘ప్రభుత్వ కార్యక్రమాలు సమన్వయంతో పూర్తి చేయాలి’

W.G: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. 22-ఏ రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ, జలధార-జలహారతి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

ELR: జిలాల్లో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం గ్రామాలలో చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. నీటి పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిపై అలసత్వం వహించకూడదన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

రౌడీయిజంపై ఉక్కుపాదం: ఎస్పీ

KDP: జిల్లాలో రౌడీయిజం, గంజాయి కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరులో జరిగిన నేర సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెల్ట్ షాపులు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

April 15, 2026 / 10:00 PM IST

ఎమ్మెల్యే కోట్లను కలిసిన వలసల రామకృష్ణ

NDL: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ బుధవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

April 15, 2026 / 10:00 PM IST

కర్నూలులో అత్యధికంగా 44.2 డిగ్రీల నమోదు

KRNL: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా లద్దగిరి, అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

April 15, 2026 / 10:00 PM IST

కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో ఈ నెల 18న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ ప్రతినిధి తిరుమల తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్తంగా ఈ శిబిరం జరుగనుంది. రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

April 15, 2026 / 09:55 PM IST

వేమిరెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరణ

NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియామకమవడం అభినందనీయమని ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆయన సత్కరించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యేకు వెంకటేశ్వర స్వామి ఫొటోను బహూకరించారు.

April 15, 2026 / 09:51 PM IST