CTR: పులిచెర్ల(M) పాతపేట సమీపంలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. అక్కడ మామిడి చెట్ల కొమ్మలను విరిచేసిన ఏనుగు కొబ్బరి చెట్లను సైతం కూకటివేళ్లతో పెకలించింది. అనంతరం అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమ గోదాములలో ఉన్న యూరియాను పరిశీలించి టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో మజ్జి శ్యామసుందర్ హెచ్చరించారు.
BPT: ప్యాడిసన్ పేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని నాయకుడు శరత్ మండిపడ్డారు. కలుషిత జలాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వారానికోసారి ట్యాంకర్లతో నీరిస్తే ఎలా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలోని పాత వాహన విడిభాగాలను ఈనెల 21న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయంలో హాజరై వేలంలో పాల్గొనవచ్చు. వాడి పక్కన పెట్టిన టైర్లు, ఇతర సామాగ్రిని ఈ వేలం ద్వారా విక్రయిస్తారు.
కోనసీమ: జిల్లా వ్యాప్తంగా హోటళ్లపై దాడులు నిర్వహిస్తూ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన తీసుకుంటామని DSO ఉదయభాస్కర్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 18 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 6-A సెక్షన్ కింద 12 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
సత్యసాయి: రెవిన్యూ కార్యాలయానికి సెలవు వచ్చిందంటే ఎర్ర మట్టి మాఫియా ఇష్టా రాజ్యంగా తరలిపోతుంది. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలోని ధనియాన్ చెరువులో చోట ముఠా నాయకులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వచ్చిందంటే చాలు మట్టి వందల లోడ్లు తరలిపోతున్నాయి. రెవిన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
కాకినాడ టౌన్- హిసార్(07717)కు ఈ నెల 21న ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ రైలు మంగళవారం ఉదయం 5. 40కి కాకినాడ టౌన్ నుంచి బయలు దేరి రెండు రోజుల అనంతరం గురువారం మధ్యాహ్నం 1:40 వరకు హిసార్కు చేరుకుంటుందన్నారు.
SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 25వ వార్డులో పలు ప్రాంతాలలో ఆదివారం కమిషనర్ శ్రీనివాసులు, ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబూరావు విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎన్టీఆర్: మాంసాహార ప్రియులకు శుభవార్త. నందిగామలో అరుదైన టోనా ఫిష్ అమ్మకాలు సందడి చేస్తున్నాయి. సుమారు 50 కిలోల బరువున్న ఈ భారీ సముద్ర చేపను పట్టణంలో తొలిసారి విక్రయానికి తీసుకురావడం విశేషంగా మారింది. కేజీ ధర రూ.500 నుంచి రూ.800 వరకు ఉండగా, ఈ చేప రుచి ప్రత్యేకమని చెబుతున్నారు. అరుదైన ఈ చేపను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
ASR: ప్రభుత్వం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంప్రూవ్మెంట్ కట్టుకునే వెసులు బాటును ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. అల్లూరి జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఫలితాలు వచ్చాయి. 5,370 మంది పరీక్ష రాయిగా 4,603 ఉత్తీర్ణత సాధించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27లోపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
PLD: జిల్లాలో ఎండల తీవ్రతపై కలెక్టర్ కృత్తిక్ శుక్ల హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 45°C-55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు బయటకు రావద్దని, అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు.
VSP: సింహాచలం చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వహించబోయే పోలీస్ సిబ్బందితో సీపీ శంఖబ్రత బాగ్చి సమీక్ష నిర్వహించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు వెంటనే సహాయం అందించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తం 2,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను టీడీపీ నేతలు లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.
PPM: పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యతకై స్వచ్చతా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ స్వచ్ఛ ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎన్.సి.డి పిఓ డాక్టర్ టి. జగన్ మోహనరావు పిలుపునిచ్చారు. రావివలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం స్వచ్ఛంద్రా కార్యక్రమం నిర్వహించారు. వైద్య బృందంతో కలిసి ఆసుపత్రి అవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు.
ఎన్టీఆర్: ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో టాప్-4లో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో 34,510 మందికి 29,103 (84%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 36,151 మందికి 31,453 (87%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి.