ATP: అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల వార్డుల పునర్విభజన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాలు ప్రస్తుతం జనగణన విధుల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ఈ నెల 26 వరకు గడువును అధికారులు పొడిగించారు.
E.G: నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడిసిన్ స్టోర్ రూమ్లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో రోగుల వార్డుకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు, సేవల వివరాలను ఈ నెల 15న తప్పని సరిగా నమోదు చేయాలని డిఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులకు చెప్పారు. సేవల రూపంలో మాత్రమే సహకారం అందించాలన్నారు.
KDP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఆర్ పెండింగ్ పనులపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ డా.శ్రీధర్ సమీక్షించారు. JC నిధి మీనా, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం, పునరావాస పంపిణీలో అస్సలు జాప్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోవాలన్నారు.
NDL: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి సమస్య తప్పేలా లేదు. మరో వారంలో శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజీకి పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 822.60 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 42.8047 టీఎంసీలకు చేరింది.
CTR: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఛైర్మన్ చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉదయం 10.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఛైర్మన్ను కలిసి వినతులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో ఎండ్ల సుస్మిత (6) నీటి గుంతలో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లాలోని సౌత్ అమలూరు, ఏకే నగర్కు చెందిన శంకరయ్య, విజయ దంపతులు జీవనోపాధి కోసం చిందేపల్లికి వలస వచ్చి నివసిస్తున్నారు. వారి కూతురు సుస్మిత పాఠశాలకు వెళ్లి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటుండగా కాలుజారి గుంతలో పడి మృతి చెందింది.
KRNL: నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. బంగారుపేట పరిధిలో దాడులు నిర్వహించినట్లు నాటుసారా నిర్మూలనలో భాగంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి, నిఘా పెంచినట్లు తెలిపారు. ప్రజలకు దాని వల్ల కలిగే హానిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేయాలని కోరారు.
NDL: జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి నిన్నఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి, వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగ ఆల్కహాల్ స్థాయి అధికంగా నమోదైంది. దీంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నెలో మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. స్థానిక చెరువును ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతీ చెరువుకు నీళ్లిస్తామన్నారు. పశువులకు తాగు నీరు, రైతుల పంటల కోసం ప్రతీ చెరువులో నీరు నిండుగా ఉంచుతామన్నారు.
తూ.గో: రాజమండ్రి మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శామ్యూల్ తెలిపారు. దీంతో జయకృష్ణపురం, బిజిలి ఐస్ ఫ్యాక్టరీ, గణేశ్ నగర్, కంబాల పార్క్, ఇన్కమ్ టాక్స్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
BPT: అటవీ, పర్యావరణ చట్టాల అమలులో రాజీ ఉండకూడదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. చీరాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో మత్స్యకారుల జీవనాధారాన్ని దెబ్బతీయొద్దన్నారు. తీర ప్రాంతాల్లో రిసార్ట్లు, లేఔట్లకు అనుమతులు ఇవ్వడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. నియమాల ఉల్లంఘన ప్రమాదకరమని హెచ్చరించారు.
VZM: రాజాం CI అశోక్ కుమార్ మంగళవారం స్దానిక మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్లయితే కౌన్సిలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల సంచారం గమనించి వారి వివరాలు సేకరించాలన్నారు
SS: లేపాక్షి మండల ఉపాధి హామీ అదనపు కార్యక్రమాధికారి (ఏపీవో) చంద్రశేఖర్కు డ్వామా ఏపీడీ శివానందనాయక్ నోటీసులు జారీ చేశారు. కూలీలకు పనులు కల్పించడం, ఎన్ఎంఎంఎస్ యాప్లో హాజరు నమోదు చేయడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మండలంలో 1937 మందికి పనులు కల్పించాల్సి ఉండగా, కేవలం 180 మందికే కల్పించినట్లు అధికారులు గుర్తించారు.
ELR: ద్వారకాతిరుమల నకిలీ టికెట్ల కేసులో అసలు దోషులను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈవో వద్ద పనిచేసిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.