విశాఖ: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా ఉంటుంది. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.
SKLM: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డిని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సమస్యలను విన్న మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
BPT: బాపట్ల పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని వేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
GNTR: పొన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షల వల్లే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
PPM: జిల్లా పర్యటన నిమిత్తం మన్యం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులకు కలెక్టర్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా మంత్రులను ఆహ్వానించారు.
అల్లూరి: తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్సు ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి 3 లక్షల మందిని అవుట్ సోర్సింగ్ పేరిట, మరో లక్ష మందిని కాంట్రాక్టు పేరిట తక్కువ వేతనాలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికైనా తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
AKP: గొలుగొండ మండలం కొమిర గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి నాయుడు ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు. గ్రామంలో ఓ విద్యుత్ స్తంభం వద్ద సరఫరా నిలిచిపోయింది. దీంతో స్పందించిన మాజీ సర్పంచ్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. మాజీ సర్పంచ్ ధైర్య సాహసాలకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
NDL: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఏప్రిల్ 9వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SC,ST అభ్యర్థులు రూ.100, ఓసీ, బీసీలు రూ.400 దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు.
KRNL: నందవరంలో బస్ స్టాండ్ వద్ద ఉన్న బీజేపీ జెండా కట్ట ఉన్నప్పటికీ మరో జెండా కట్ట ఎందుకని BJP ఓబీసీ రాష్ట్ర నాయకులు ఈరన్న ఇవాళ ప్రశ్నించారు. కొందరు నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీలో భేదాభిప్రాయాలు సృష్టించేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కూటమిలో ప్రతి నాయకునికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
PPM: రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో కలిసి బలిజిపేట మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారపు సంత ద్వారా మొత్తం రూ. 3,98,200 ఆదాయం సమకూరింది. ఇందులో గొర్రెలు, మేకల సంత నుంచి రూ. 2,49,300 లభించగా, పశువుల సంత నుంచి రూ. 1,48,900 రాబడి వచ్చినట్లు యార్డు ఇంఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చనట్లు ఆయన పేర్కొన్నారు.
కాకినాడ: పెద్దాపురంలో తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణానికి చెందిన 30 ఏళ్ల యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక బయట ఆడుతుండగా.. చేయిపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి క్షేత్రం వద్ద నది ప్రమాదాలకు నిలయంగా మారిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పటికే ఎందరో మృత్యువాత పడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి ఇటీవల సూచించింది. ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా నగదు జమ చేసి తిరిగి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగించారని ఓ మాజీ ఉద్యోగి ఆమె పై ఫిర్యాదు చేశారు.
TPT: త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ జంట వేరువేరు చోట్ల సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప(D) సుండుపల్లి(M)నికి చెందిన అనిషా (18), అస్లాంకు ఏడాది కిందట.. ఈ జూన్లో పెళ్లి ఖాయం అయింది. అయితే భాగంపల్లెలో అనిషా ఉరి వేసుకుని చనిపోగా.. చంద్రగిరి పరిధిలో అస్లాం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.