NDL: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఏప్రిల్ 9వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SC,ST అభ్యర్థులు రూ.100, ఓసీ, బీసీలు రూ.400 దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు.