KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 224 మందిపై కేసులు నమోదు చేసి రూ.46,660 జరిమానా విధించారు. శిరస్త్రాణం లేకుండా, సీటు బెల్టు ధరిం చకుండా, పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
VZM: ఆగస్ట్ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె.నారాయణ తెలిపారు. ఆదివారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదల కోసం అధునాతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తే గత YCP ప్రభుత్వం రూ.3.60 లక్షల ఇళ్లను రద్దుచేసి మిగిలిన ఇళ్లను పూర్తి చేయలేదని విమర్శించారు.
ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సోమవారం ఉ. 10 కు పోలాకి మండలం ఓది పాడు గ్రామంలో, నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత, చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.3 కు సారవకోట మండలం తహశీల్దార్ కార్యాలయనికి శంకుస్థాపన చేస్తారు. సా. 4 కు జలుమూరు KG BV పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభిస్తారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.
కడప నగరంలోని నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఇవాళ నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జవాబుపత్రాలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,95,674 జవాబు పత్రాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.
కోనసీమ: ఆలమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ టర్నింగ్ వద్ద చీదల రామారావు అనే వ్యక్తి ఆదివారం భార్యతో గొడవపడి సమీపంలోని హైపవర్ కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై నరేశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రామారావును సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీల విగ్రహాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కాకినాడ కలెక్టరేట్లోని సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం వరకు సమస్యలపై వినతులను స్వీకరిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.
E.G: గోపాలపురం మండల పరిధిలోని కోమటికుంట గ్రామ శివారులో ఆదివారం జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగేశ్వరనాయక్ ఆదివారం తెలిపారు. డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. డ్రోన్ను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
తిరుపతి: నాగలాపురం మండలంలోని సర్పంచుల సన్మాన కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక వ్యాపార సంఘం కల్యాణ మండపంలో నిర్వహించనున్నారని మండల అధ్యక్షుడు అపరంజిరాజు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.
ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నేడు జరగాల్సిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు అయింది. బందోబస్తు, భద్రతా విధుల్లో పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
E.G: గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం రాజమండ్రిలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఏలూరు రేంజ్ డీఐజీ, వివిధ జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు హాజరయ్యారు. పుష్కరాల నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక రూపొదించాలన్నారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాయలంలో ఆర్జిత సేవలను నేటి నుంచి మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. అర్చన చేయించాలంటే భక్తులు రుసుం రూ.10 చెల్లించాలని వివరించారు. అంతరాలయం ప్రవేశం (ఇద్దరికీ) రూ.50,ప్రతినెలా మాస పౌర్ణమికి జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలంటే రూ.వెయ్యి చెల్లిస్తే ఇద్దరికీ అనుమతిస్తామని వివరించారు.
VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం భోగాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించామని, విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి సులభంగా రాకపోకలు కల్పించేలా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
SKLM: ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకు చెందిన కామేశ్వరరావు, వనజాక్షి దంపతులు ఆదివారం రాత్రి రాంగ్ రూట్లో బైక్పై వెళ్తుండగా ఎచర్ల మండలం, కేశవరావు పేట వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వనజాక్షి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందగా, కామేశ్వరరావుకు కాలికి గాయమైంది.