ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈనెల 18, 19 తేదీల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ భాషా తెలిపారు. ఈ మేళాలో 80 మంది రైతులతో 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, 150 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్గా వెబ్ ల్యాండ్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అటవీ చెక్ పోస్టులను పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి భద్రతను పెంచాలన్నారు.
KDP: కలసపాడు MPDO కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు MPDO మహబూబీ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరుగుతుందన్నారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రజలు, కూలీలు, అధికారులు హాజరుకావాలని సూచించారు.
బాపట్ల: పంగలూరు మండల విద్యాశాఖ అధికారిగా షేక్ కాలేషావలిని ఉన్నతాధికారులు నియమించారు. ప్రస్తుతం దర్శిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు ఎంఈఓగా ఉన్న కే. నాగభూషణం మార్చిలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కాలేషావలిని నియమించారు.
KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఇటిక్యాలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని పోలీసులు తెలిపారు.
గుంటూరు: తెనాలి చినరావూరులోని సత్యనారాయణ లేక్ పార్కును మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం ఉదయం సందర్శించారు. పార్కు పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మరుగుదొడ్లు, పిల్లల ఆట పరికరాలను పరిశీలించి నిర్వహణ మెరుగు పరచాలని ఆదేశించారు. వేసవి కాలంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.
కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. భవన నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా డిమాండ్ మేరకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే జొన్నాడ, కపిలేశ్వరపురం, రావులపాడు, ఆలమూరు స్టాక్ పాయింట్లలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలని సూచించారు.
ATP: విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయడం, దర్యాప్తును సకాలంలో నాణ్యతగా పూర్తి చేయడం వంటి విధుల్లో రాణించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించిన వారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ELR: స్వయం ఉపాధితో జీవనం సాగించడానికి తనకి చేయూత కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను ఓ యువతి కోరింది. ప్రభుత్వం చాయ్ రాస్తా వ్యాపారం చేసుకోవడానికి సెర్ప్ ద్వారా చేయూత అందిస్తోందని అందుకు స్థలాన్ని కేటాయించే విధంగా సహకరించాలని కోరింది. చాయ్ రాస్తా వ్యాపారం నిమిత్తం స్థలాన్ని కేటాయింపు చేయాల్సిందిగా చింతలపూడి మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
NDL: కొలిమిగుండ్ల మండల ఇంఛార్జ్ తహసీల్దార్గా నాగేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఇంఛార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సాయి విశ్వతేజ పది రోజుల క్రితం సెలవులపై వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు నాగేశ్వర రెడ్డిని కొలిమిగుండ్ల మండలం ఇంఛార్జ్ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు.
KRNL: ఆస్తి పన్ను చెల్లింపులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ ఓ ప్రకటనలో కోరారు. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే 50 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం నగరంలో 6 ప్రత్యేక కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
NDL: డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శుక్రవారం ఉదయం 10 గంటలకు బేతంచెర్లకు వస్తున్నట్లు టీడీపీ మండల నాయకులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉంటారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
PPM: స్థానిక గాయత్రి అపార్ట్మెంట్లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు, సిబ్బంది గృహిణులకు నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.బహిరంగ మంటలు నిషేధం అని సూచించారు.
SRCL: వేములవాడ భీమేశ్వరస్వామివారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఉన్నారు.
KKD: ఏలేశ్వరం(M) చిన్నింపేట జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున భారీ ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి కత్తిపూడి వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను దాటి, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ధాటికి లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.