గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి, సేవల అమలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు.
విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ బాలస్వామికి వినతిపత్రం అందజేశారు. నిధి పోర్టల్ను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలన్నారు.
KDP: ఆహార ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నజ్మా పేర్కొన్నారు. మంగళవారం కడపలోని యాంపుల్ ఫుడ్స్ పరిశ్రమకు పులివెందుల, వేంపల్లె ఎస్సీ యువత, మహిళ రైతులను తీసుకెళ్లి, ఆహార ప్రాసెసింగ్ విధానాలు, విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, నిల్వ పద్ధతులు, ప్యా కేజింగ్ పై అవగాహన కల్పించారు.
ATP: అనంతపురంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
PLD: అచ్చంపేట మండలం మాదిపాడు సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఛైర్మన్గా ఎన్నికైన యర్రంశెట్టి సత్యవతి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తుల విశ్వాసాలను కాపాడాలని సూచించారు. మాదిపాడు–గుడి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కృష్ణా: గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (బుక్ కీపర్)లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NTR: స్మార్ట్ కిచన్ పధకం రద్దు చేసి ప్రస్తుతం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను కొనసాగించాలని మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ఈ నెల 27న విజయవాడ కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని మంగళవారం నందిగామ సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు.
కోనసీమ: రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా వాసంశెట్టి వారి పేటలో రూ. 27 లక్షలతో నిర్మించనున్న 20,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, రూ.36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లీనిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
KKD: పెద్దాపురం నవోదయ పాఠశాలలో NCC వార్షిక శిక్షణ శిబిరం చేపట్టినట్లు మేజర్ మహమ్మద్ అసిఫ్ మంగళవారం తెలిపారు. ఈ శిబిరానికి 680 మంది క్యాడట్లు హాజరయ్యారు. వారికి మ్యాప్ రీడింగ్, ఆయుధ శిక్షణ, బాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్, దేశ రక్షణ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ శ్రీనివాసరావు, లెఫ్టినెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో జనసైనికులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని చిన్నారులతో కలిసి భోజనం చేశారు. డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వయంగా ఆయన భోజనం వడ్డించారు.
TPT: తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారిని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్ద చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈవో సుబ్బిరామిరెడ్డి స్వాగతం పలికి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాల నిర్వహణలను కళ్లారా చూసి ఆనందం వ్యక్తం చేశారు.
BPT: సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం, వెల్లలచెరువు గ్రామాల్లో రైతులకు పచ్చిరొట్ట పంటలపై (జీలుగా, జనుము, పిల్లిపెసర) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి (AO) షేక్ సైదా మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా నేలలో సేంద్రీయ కర్బనం పెరుగుతుందని తెలిపారు.
PPM: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్సీడీ అధికారి డా. టి. జగన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు బాగువలస, మెంటాడవీధి ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వివరాల నమోదు, ల్యాబ్ నివేదికలు, పరికరాల పనితీరును పరిశీలించారు. పిహెచ్సీల్లో ప్రసవ సేవలు మెరుగుపర్చాలని, మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
గుంటూరు: జీజీహెచ్లో సిబ్బంది తీరుపై వైసీపీ మండిపడింది. ఆక్సిజన్ రోగులను వదిలేసి సిబ్బంది కబుర్లలో మునిగారని విమర్శించింది. ఎక్స్రే టెక్నీషియన్ అనిల్ రోగులతో దురుసుగా ప్రవర్తించారంది. సూపరింటెండెంట్కు ఎవరూ భయపడరని అతడు వెటకారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి ఇదే సాక్ష్యమంటూ సీఎం, మంత్రిని ఎక్స్లో ప్రశ్నించింది.
ATP: అనంతపురం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పంపిణీ చేశారు. వడియంపేట మాజీ సర్పంచ్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం 21 రకాల దివ్యాంగతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఆమె తెలిపారు.