• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రక్తదానం మరొకరికి పునర్జన్మ’

PPM: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ప్రజలు రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు.

April 10, 2026 / 01:14 PM IST

‘ఫేస్ యాప్ రద్దు చేయాలి’

SKLM: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం గుళుమూరులో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఈపద్ధతి వలన కొంతమందికి హాజరుపడక ఇబ్బంది పడుతున్నారని, దీనివలన వేతనం నష్టపోతున్నారన్నారు.

April 10, 2026 / 01:11 PM IST

క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రులు

ATP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

April 10, 2026 / 01:10 PM IST

నెల రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జి మూసివేత

CTR: రేణిగుంట పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని ఈనెల 13వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు సంత గేటు మార్గంలో, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు నారాయణాద్రి ఆసుపత్రి మీదుగా వెళ్లాలని సూచించారు.

April 10, 2026 / 01:09 PM IST

సెమినార్ హాల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు . కళాశాలలో రూ. 35 లక్షలతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

April 10, 2026 / 01:02 PM IST

‘పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు’

W.G: మొగల్తూరు మండలం వారతిప్పలో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. నిషేధం అమలులో ఉన్నా నిర్వాహకులు బహిరంగంగానే స్థావరాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ జూదాన్ని అరికట్టాలని తెలిపారు.

April 10, 2026 / 01:00 PM IST

చీరాల అరోమాస్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: కొత్తపేట సంపత్ నగర్‌లో నూతనంగా నిర్మించిన Chirala Aromas Restaurantను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన అనంతరం, వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 01:00 PM IST

‘మతం మారితే ఎస్సీ హోదా రద్దు తీర్పు అన్యాయం’

GNTR: విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించి, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్‌సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునః పరిశీలించాలని విలేకరుల సమావేశంలో ఆయన కోరారు.

April 10, 2026 / 12:55 PM IST

స్వామివారిని దర్శించుకున్న పారిశ్రామిక వేత్త

W.G: పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారిని స్విట్జర్‌లాండ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ, పాలకొల్లుకు చెందిన బి.సత్యనారాయణ రాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.

April 10, 2026 / 12:55 PM IST

ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభం

కోనసీమ: రావులపాలెంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు  శుక్రవారం నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ డీసీఏ కోర్సు ఉచితంగా నేర్పబడునని పేర్కొన్నారు. శిక్షణ పొందేవారు శుక్రవారం నుండి జరిగే శిక్షణలో పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

April 10, 2026 / 12:42 PM IST

నిరుద్యోగ సమస్యలపై గళమెత్తిన నేతలు

విశాఖ ఆర్టీసీ ఇన్ గేట్ జంక్షన్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి ప్రచారంలో భాగంగా కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏప్రిల్ 14న జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

April 10, 2026 / 12:38 PM IST

APGEA తాలూకా అధ్యక్షునిగా సాయికుమార్ ఏకగ్రీవం

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా కమిటీ ఎన్నికలు నేడు రాయచోటి ఏరియా హాస్పిటల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో సాయికుమార్ తాలూకా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రవీంద్ర, ట్రెజరర్‌గా వెంకటేష్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

April 10, 2026 / 12:37 PM IST

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపల్

NDL: మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్లో ఈ నెల 12న జరగనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శుక్రవారం ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

April 10, 2026 / 12:25 PM IST

‘అది అమరావతి కాదు కమ్మరావతి’

VZM: రాష్ట్ర రాజధాని అమరావతి కాదు కమ్మరావతి అని ప్రజలు చర్చించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఈ మేరకు గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణంపై ప్రజలు మేధావులు చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. అలాగే, ప్రభుత్వం సాధ్యమైన పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.

April 10, 2026 / 12:24 PM IST

వంతెన కోసం వినూత్న ఆందోళన

PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి గాజులగూడలో మోకాళ్లపై నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన పూర్తైతే సుమారు 40 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

April 10, 2026 / 12:23 PM IST