గుంటూరు: అమరావతి అసెంబ్లీ భవన్లో గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వపరమైన పలు విషయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ASR: పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ప్రపంచ కళాదినం సందర్భంగా చిత్రలేఖన పోటీలు గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు సుమారు 30 మంది విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ జనపరెడ్డి అప్పారావు స్వఖర్చులతో బహుమతులు అందజేశారు.
ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీచక పర్వంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
PPM: APTF ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న జరగనున్న జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రావాడ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం గళం విప్పాలని వారు కోరారు.
AKP: జనగణన ప్రక్రియలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం మండలం మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వీయ గణన చేసుకున్నారు. గృహ గణనకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అడిగిన వివరాలను నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి గృహ గణన ప్రారంభం అయిందని అన్నారు.
విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ఆయన వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ఎంతో సులభమన్నారు.
NDL: వేల్పనూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆత్మకూరు బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఇవాళ ఎమ్మెల్యే స్వగృహంలో ప్రెసిడెంట్ బోల్లు నగేష్,సెక్రటరీ సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్ నూర్ అహమ్మద్ కలిసి సత్కరించారు. ఆత్మకూరులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ,శిధిలావస్థలో ఉన్న కోర్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.
ATP: ఆర్డీటీ కోసం బహుజన రాజ్యాధికార జేఏసీ నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల ‘చలో రాజధాని’ పాదయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొని, మాట్లాడారు. సామాజిక న్యాయం, సేవా సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రకు సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సత్యసాయి: గోరంట్ల మండలం పులేరు గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పురుషులకు గురువారం వంటల పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో కుటుంబ పోషణలో పురుషుల భాగస్వామ్యం అంశంపై తండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. గర్భిణీలు, చిన్నపిల్లల సంరక్షణలో తండ్రుల బాధ్యతలను క్షుణ్ణంగా వివరించారు.
కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రఘునాథ్, షాహిద్, ఆఫ్రిద్ డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయులను ఆయన వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గేదెకు వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ELR: ద్వారకాతిరుమలలో పోలీసు సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం క్వార్టర్స్లో ఎవరు లేకపోవడంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్వార్టర్స్ నిరుపయోగంగా మారడంతో విషపురుగుల సంచరించే అవకాశం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి క్వార్టర్స్ పునరుద్ధరించాలని కోరారు.
విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఏపీలో జరుగుతున్న స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాలు భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
NLR: దేశ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు R&B గెస్ట్ హౌస్లో గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. DRO ఓబులేసు మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన కొనసాగుతుందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
ఎన్టీఆర్: గుంటూరులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వర కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.