• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘శారీరక వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’

VZM: ప్రపంచ ఆరోగ్య దినోత్సోవం సందర్భంగా ఇవాళ స్దానిక 42వ డివిజన్‌ అయ్యన్నపేట మున్సిపల్‌ నడక మైదానంలో ఆంజనీపుత్ర చిరంజీవి వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ డా.డివిజి శంకర‌రావు మాట్లాడుతూ.. రోజు నడక, యోగ, తదితర శారీరక వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని స్థానికులకు సూచించారు.

April 7, 2026 / 11:45 AM IST

భక్తులకు గుడ్ న్యూస్.. RTC ప్రత్యేక సర్వీస్

కోనసీమ: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి కర్ణాటక, మైసూర్ ఎనిమిది రోజుల పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్. కుమార్ తెలిపారు. ఈ బస్సు ఈ నెల 25వ తేదీ మధ్యాహం రావులపాలెం నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 11:44 AM IST

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

ELR: చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ సమిష్టిగా పనిచేయాలని, సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో PHCల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

April 7, 2026 / 11:43 AM IST

కాకినాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

KKD: కాకినాడ కమిషనర్ ఎన్.వి.వి సత్య నారాయణ మంగళవారం కచేరిపేట, వేంకటేశ్వరనగర్, పాత బస్టాండ్ ప్రాంతాలలో పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను తనిఖీ చేసిన ఆయన, కార్మికుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. శానిటేషన్ విషయంలో రాజీ పడవద్దని సిబ్బందిని ఆదేశించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

April 7, 2026 / 11:42 AM IST

ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు: మంత్రి

కోనసీమ: ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మెరుగైన సమాజం సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని, ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు.

April 7, 2026 / 11:38 AM IST

ఉజ్జంగి–సిరసాగూడ రోడ్డులో ప్రమాదకర మలుపు

ASR: డుంబ్రిగూడ మండలం ఉజ్జంగి–సిరసాగూడ మధ్య నిర్మాణంలో ఉన్న బీటీ రోడ్డులో మలుపు ప్రమాదకరంగా ఉందని సర్పంచ్ కిముడు హరి తెలిపారు. ఇటీవల ఒక వాహనం మలుపు వద్ద లోయలో పడిన ఘటన జరిగినట్లు చెప్పారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు పూర్తికాకముందే మలుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

April 7, 2026 / 11:34 AM IST

ఆటో కాలువలో పడి పలువురికి గాయాలు

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె గెలివి వే బ్రిడ్జి వద్ద ఇవాళ ఆటో ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 7, 2026 / 11:33 AM IST

జిన్నాంలో పాలధార చెరువు పనులను పరిశీలించిన పీడీ

VZM: గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో పాలధార చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ శారదాదేవి ఇవాళ పరిశీలించారు. పని ప్రదేశంలో శ్రామికులందరికీ ముఖ ఆధారిత హాజరు వెళ్లిందా లేదా, పని ప్రదేశంలో సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలతో పనిచేయిస్తున్నారా లేదా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:30 AM IST

కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌కు లెఫ్టినెంట్ హోదా

VSP: కృష్ణ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ అదనంగా NCC బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణకు 3 నెలల పాటు మహారాష్ట్రలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఓటీఏ ట్రైనింగ్ నిర్వహించగా 570 మంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ బాబు ఇవాళ సత్కరించారు.

April 7, 2026 / 11:30 AM IST

పాఠశాలలను బలోపేతం చేయండి: స్పీకర్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురం మోడల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నూతన విద్యార్థుల నమోదు ప్రక్రియ కరపత్రాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:23 AM IST

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

E.G: అమరావతిలోని సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్‌గా మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రభుత్వ ఆదాయ వనరుగా విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను మార్చాలని కమిటీ సిఫార్సు చేశారు.

April 7, 2026 / 11:22 AM IST

తాగునీటి కోసం ముందస్తు చర్యలు

KRNL: తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్లెల్సీకు నీటి విడుదల నేపథ్యంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ బసాపురం కాలువను ఇవాళ పరిశీలించారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. నీటి నిల్వపై ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డీఈలు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:18 AM IST

ప్రొద్దుటూరుకు 2 కోర్టులు మంజూరు..!

KDP: రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచరు, లైబ్రరీని మంజూరు చేశారు.

April 7, 2026 / 11:15 AM IST

ప్రత్యేక అలంకరణలో బోయకొండ గంగమ్మ

TPT: ప్రముఖ పుణ్య క్షేత్రమైన బోయకొండలో గంగమ్మను మంగళవారం అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కట్టారు. కోర్కెలు ఫలించిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు.

April 7, 2026 / 11:14 AM IST

అకాల వర్షం.. నీట మునిగిన వరి పంట

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు నష్టపోయారని సీపీఐ నాయకుడు జనమాల గురవయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ఇవాళ ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామంలో పంటలను పరిశీలించి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.

April 7, 2026 / 11:14 AM IST