KRNL: నందవరం మండలం హాలహర్వికి చెందిన విద్యార్థులు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రేమ్ కుమార్ను గ్రామస్థులు అభినందించారు. విద్యాభ్యాసంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ స్థితిగతులపై చర్చించారు. అలాగే, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని శివ నగర్ కాలనీలో గల MPUP స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్య తీరును తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ‘ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.
కడప శివారులోని మూలవంక వద్ద పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ గురువారం మధ్యాహ్నం చూస్తుండగానే కాలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పాలని చూశారు కానీ.. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా బ్యాటరీలో ఏదైనా లోపమా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: బుట్టాయగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ పరిసరాలను కమిటీతో పాటు అటవీ శాఖా అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పాటు చేస్తామన్నారు.
TPT: తిరుపతి రుయాలో గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు. ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకుని సేవలు పొందవచ్చని వైద్యులు సూచించారు.
AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.
కోనసీమ: పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు వంతెనపై శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మూసివేసిన ఈ వంతెనకు సుమారు రూ.61 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. వంతెనపై సోలార్ దీపాలు, ట్రాఫిక్ సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: టంగుటూరులో వాహనాలు అడ్డదిడ్డంగా పెడుతుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. టంగుటూరు బస్టాండ్ కూడలి దగ్గర నుంచి పొదిలి వైపు వచ్చే రహదారుల షాపింగ్ కాంప్లెక్స్ ముందు వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పిందించి ట్రాఫిక్ను నియంత్రించాలని కోరుతున్నారు.
E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పీ.మనోహర్ గురువారం హెచ్చరించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్పై డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపిన రామారావు, లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.11,500 చొప్పున జరిమాన విధించారు.
CTR: పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” అనే కార్యక్రమం పూతలపట్టు సీఐ గోపి నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రోత్సహిస్తూ వారి వివరాలను సేకరించారు. అలాగే హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ వారి వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
NTR: జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అధికారులతో కలిసి 123 ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సంవత్సరంలో ప్రమాదాల రేటు తగ్గిందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
GNTR: NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు సంగడిగుంటలో ఇందిరా గాంధీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్ కరీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NSUI జెండాను ఆవిష్కరించారు. శిబిరంలో కంటి, గుండె, దంత, జనరల్ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినం రోజు ఏప్రిల్ 20 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో పది రోజులపాటు ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11 లోపు వెయ్యి మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు.
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పద్మశ్రీ అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. పీఎఫ్ విభాగంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.