గుంటూరు: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు విధానంపై పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
AKP: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నక్కపల్లి ఎంపీడీవో కే.చలపతిరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉపమాక పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
NLR: కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాలతో వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ బృందం గురువారం సాయంత్రం కపాడిపాలెం, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు 5 వీధి శునకాలను బంధించి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్కు తరలించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువుల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
KDP: పులివెందుల మున్సిపాలిటీలో ఇంఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్న మునికుమార్కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ముని కుమార్, ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ATP: జిల్లా పరిధిలో భూ సర్వే పనులు వేగవంతం చేసేందుకు 247 లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) విష్ణు చరణ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొంది ఉండాలని, మూడేళ్ల లైసెన్స్ రెన్యువల్ కలిగి ఉండాలని తెలిపారు.
బాపట్ల: చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన నలుగురిని అధికారులు వెట్టి వ్యవస్థ నుంచి విడుదల చేశారు. కర్లపాలెం ప్రాంతంలో ఓ వ్యక్తి వారి మీద బలవంతపు పని మోపుతున్నట్లు సమాచారం రావడంతో చర్యలు తీసుకున్నారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా వారికి విముక్తి పత్రాలు అందజేసి, స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు.
కోనసీమ: రాయవరం మండలం చెల్లూరులోని పురాతన అగస్తీశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడు మల్లేష్కు గురువారం కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 13న నిందితుడు ఆలయంలోని హుండీని పగలగొట్టి రూ.5వేల నగదుతో పాటు సీలింగ్ ఫ్యాన్ను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
KRNL: YCP హయాంలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారంటూ నిన్న పార్లమెంట్లో MP భైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు MLC వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో కూటమి నేతల అరాచకాలు కనిపించడం లేదా? మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి పదవులు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే 50% రిజర్వేషన్లు, డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు అందించామన్నారు.
VSP: ఫేకర్స్ లే అవుట్లో ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సుమారు 800 కుటుంబాలకు వినోదం, పిల్లల ఆటల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటెన్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థల వివరాలు, అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు.
VZM: మే 9న రాజాంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, బీమా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
NDL: CM రేవంత్ రెడ్డిని గురువారం జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.
NDL: సంజామల మండలంలో అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.1°C, ఆ తర్వాత కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9°C ఎండ తీవ్రత నమోదైనట్లు గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు నేడు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43°C – 44.5°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
PPM: మాజీ MLA అలజంగి జోగారావు ఆద్వర్యంలో గురువారం పార్వతీపురం అర్బన్లో కాఫీ విత్ YCP కేడర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11,12,13 వార్డుల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీ బలోపీతానికి కృషి చేస్తామని స్పష్టం చేసారు.
అన్నమయ్య: మదనపల్లెలో ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపింది. కురబలకోట మండలానికి చెందిన MPC విద్యార్థిని 9 మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయి మనస్థాపంతో పురుగులమందు తాగింది. మరోవైపు ఇందిరానగర్కు చెందిన CEC విద్యార్థిని ఫెయిల్ కావడంతో నిద్ర మాత్రలు మింగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.