CTR: గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అర్జున్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్కు బెంగళూరులో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి,రాజంపేట శాశ్వత పరిశీలకులు భీమినేని చిట్టిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి నాయుడు, కొత్త వెంకటాపురం సర్పంచ్ ప్రసన్న కుమార్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, సుధాకర్ నాయుడు, లోకనాథం పాల్గొన్నారు.
NDL: శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ట్రస్ట్బోర్డు సభ్యుల సమావేశం ముగిసింది. ఇందులో 15 అంశాలకు ఆమోదం తెలుపగా 2 అంశాలను తిరస్కరించారు. 20 చోట్ల భక్తుల కోసం టాయ్లెట్ల నిర్మాణం, రూ.24 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణానికి ఆమోదం, 6 వేల మొక్కలు నాటాలని బోర్డు నిర్ణయించినట్లు ఈవో చెప్పారు.
అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన ‘జలధార–జలహారతి’ అవగాహన సదస్సులో NREGS రాష్ట్ర డైరెక్టర్ వై.వి.కే. షణ్ముఖ్ కుమార్ గ్రామాల నీటి వనరుల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని సూచించారు. చెరువులు, కాలువలు, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలతోనే పనులు చేపట్టి, రోజువారీ శ్రామికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
ELR: ప్రస్తుత వేసవిలో ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ SE పి.సాల్మన్ రాజు మాట్లాడుతూ.. వేసవి కాలంలో అవసరమైనంత విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. ఏదైనా విద్యుత్ అవాంతరాలు, సమస్యలు తలెత్తితే సమీప కార్యాలయంలో వినియోగదారులు తెలపాలన్నారు.
PPM: జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ బీమా పథకాలు వర్తించేలా బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రత కల్పించడంలో భీమా పథకాలు కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
NTR: నందిగామలో కోనేరు ఆక్రమణకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసన నాలుగో రోజుకు చేరింది. రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన కోనేరు స్వామివారి వశంలోకి ఇవ్వాలని కోరుతూ.. భక్తిశ్రద్ధలతో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, “ఓం నమశ్శివాయ” నామస్మరణతో భజనలు చేశారు. అనంతరం స్వామివారికి వినతిపత్రం సమర్పించారు.
SKLM: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల తొమ్మిదవ తేదీన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని, ఇంతవరకు చర్యలు తీసుకోకూడదు మరోసారి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు.
PPM: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి సీడీపీవో బొత్స అనంతలక్ష్మి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాచిపెంట, మక్కువ మండలాల్లోని వివిధ గ్రామాల్లో మొత్తం 24 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థులు మే 14వ తేదీలోగా తమ దరఖాస్తులను పాచిపెంట కార్యాలయంలో అందజేయాలని కోరారు.
CTR: చౌడేపల్లెలోని అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో కొలిచి.. మొక్కులు చెల్లించారు. వారికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు MLA బోడె ప్రసాద్ మంగళవారం అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని MLA సూచించారు. వయస్సుకు అనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, స్తోమత ఉన్నవారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
KKD: జిల్లాలో డీజిల్ సరఫరాలో వరి కోత యంత్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హరేంధర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం తాళ్లరేవులోని హెచ్పీసీఎల్ బంకును తనిఖీ చేసిన ఆయన, కూపన్ ద్వారా రైతులకు 70 లీటర్ల వరకు డీజిల్ పంపిణీ చేయాలని సూచించారు. రైతులు మినహా ఇతరులెవరికీ డబ్బాలు లేదా బాటిళ్లలో ఇంధనం విక్రయించవద్దని బంకు యజమానులను ఆదేశించారు.
సత్యసాయి జిల్లా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక (పీఎల్పీ) పుస్తకాన్ని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగాల రుణ సామర్థ్యాన్ని రూ. 13,833.66 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 9,365.64 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 3,457.65 కోట్లు కేటాయించారు.
KRNL: జనగణనలో భాగంగా ప్రతి కుటుంబం స్వీయ గణన నమోదు చేసుకోవాలని ఆదోని MLA పార్థసారథి కోరారు. ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చని, సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. 10–15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 30లోపు నమోదు పూర్తి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో MRO శేషఫణి, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, వీఆర్వో రాజశేఖర్ ఉన్నారు.
TPT: శ్రీసిటీలో మహిళ భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై ప్రియాంక మహిళలకు ధైర్యం నింపారు. “భయపడొద్దు పోలీస్ మీతోనే ఉంది” అంటూ ఆమె భరోసా కల్పించారు. KGI కంపెనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల రక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. పోలీసులు ఎప్పుడూ మహిళల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని తెలిపారు.
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా బీజేపీ నాయకురాలు కోటిపల్లి సుబ్బలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు విజయవాడ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైనట్లు ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.