BPT: బల్లికురవ మండల పరిధిలోని కూకట్లపల్లి గ్రామంలో నివాస స్థల వివాదానికి సంబంధించి సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తన నివాస స్థలం విషయంలో వివాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పేరి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
GNTR: ఆర్టీసీ బస్టాండు పార్సిల్ కార్యాలయంలోని పార్సిళ్లకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తులు చెల్లించి, ఎవరైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
GNTR: పోలీసునని నటిస్తూ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిపై జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. గోపి అనే వ్యక్యికి 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.23 వేల జరిమానా విధించింది. ఇప్పటికే 29 కేసులు ఉన్న నిందితుడిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకరికల్లు చెరువులో నీటి నాణ్యతను ఎస్ఈ, కమిషనర్ రమ్య కీర్తన, డీఈ రఫీ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిత్తూరులోని సీఆర్ రెడ్డి కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ప్రారంభంకానున్నట్లు ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు, పాటలు చదువు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
తూ.గో: రాజానగరంలోని ఐవోసీఎల్ పెట్రోల్ బంక్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరఫరాలో అక్రమాలు జరిగితే 8074661259 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరలు, కొలతలను పరిశీలించి, నిరంతర సరఫరాకు అధికారులను ఆదేశించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో సహకారం, ఓఎక్స్ఎంఐక్యూ తో రూ. 400 కోట్ల ఏఐ సెంటర్ ఏర్పాటు, మరియు ఐఐటీఎమ్ తో రూ. 180 కోట్ల వాతావరణ పరిశోధన ఒప్పందాలను వర్సిటీ కుదుర్చుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ఎం. వెంకయ్య నాయుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు పూర్వ విద్యార్థులను వర్సిటీ సత్కరిచింది.
కాకినాడ: దుబాయ్లో ఉపాధి పొందుతూ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న పెద్దాపురం మండలం దివిలికి చెందిన సన్యాసిరావు ఎంపీ ఉదయ శ్రీనివాస్ చొరవతో సోమవారం స్వగ్రామం చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రావడానికి ఇబ్బంది పడుతుండగా, ఎంపీ ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న సన్యాసిరావు కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు.
తూ.గో: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వాళ్లతో మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు. సమస్య ఉన్నచోట్ల సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు.
ATP: హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి, రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేంద్రరెడ్డి, ఓం ప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రంగమ్మ, ఉమాదేవి గ్యాంగులతో సంబంధాలు నడుపుతూ బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో నరేంద్రరెడ్డిది కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు.
NLR: వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ లెక్కల కాంతారెడ్డి, కార్యనిర్వహణాధికారి బి.శాంతయ్య తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
కోనసీమ: పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రను నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని ఇండి కూటమి వైఖరిని తప్పు పట్టారు. బిల్లుకు అడ్డుపడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
KRNL: 104 సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రాలయం TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనాలు, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, గ్రాట్యుటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే డ్రైవర్లకు స్లాబ్ అమలు, కనీస వేతనం పెంపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
BPT: పంగులూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకును సోమవారం మండల తహసీల్దార్, ఎస్సై వినోద్ బాబు సంయుక్తంగా తనిఖీ చేశారు. బంకులో ఉన్న స్టాక్ రిజిస్టర్లను, నిల్వలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సదరు బంకులో ప్రస్తుతం 12,000 లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని గుర్తించినట్లు తెలిపారు.
NDL: మిడుతూరు (మం) రోళ్ళపాడు గ్రామానికి చెందిన శివుడిని విద్యుత్ శాఖలో వాచ్మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కోడుమూరుకు చెందిన వీరేష్ రూ.1.50లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుడు సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.