• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జలధారతో చెరువులకు నీటి సరఫరా

TPT: జలధార కార్యక్రమం ద్వారా చెరువులకు తక్కువ ఖర్చుతో శాస్త్రీయంగా నీటి సరఫరా కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఎర్రావారిపాలెం మండలంలో పనులను పరిశీలించిన ఆయన, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణతో భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. సుస్థిర నీటి నిర్వహణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

April 16, 2026 / 09:22 PM IST

రాయచోటిలో రాత్రి నియంత్రణలు అమలు

అన్నమయ్య: రాయచోటి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ ఆక్ట్ సెక్షన్ 30 అమల్లోకి వచ్చింది. అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 10:30 గంటలలోపు తప్పనిసరిగా మూసివేయాలని పోలీసులు సూచించారు. రాత్రి 11 గంటల తరువాత అకారణంగా రోడ్లపై తిరగడం, గుంపులుగా గుమికూడడం నిషేధించారు. అనుమానితులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

April 16, 2026 / 09:03 PM IST

టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా రామసుబ్బమ్మ

సత్యసాయి: నల్లమాడ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకురాలుగా పనిచేస్తున్న మేడాపురం గ్రామానికి చెందిన పాలెం రామసుబ్బమ్మను టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు గాండ్ల సంఘం నాయకులు పాలెం రామసుబ్బమ్మను సన్మానించారు. భవిష్యత్తులో పార్టీలో మరిన్ని ఉన్నత స్థాయి పదవులు పొంది, ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

April 16, 2026 / 09:00 PM IST

‘మహిళలపై టీడీపీ ద్వంద్వ వైఖరి’

VSP: మహిళల సంక్షేమానికి జగన్ పాలన ‘గోల్డెన్ పిరియడ్’ అని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణి పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లతో మహిళలకు భద్రత పెరిగిందన్నారు. అలాగే, అమ్మఒడి, చేయూత వంటి పథకాలలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.

April 16, 2026 / 08:50 PM IST

తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు

ఎన్టీఆర్: కొండపల్లిలో తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో రెండు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయాన్ని ఆయన ఇటీవల గుర్తించారు. దీనిపై గొల్లపూడిలోని కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

April 16, 2026 / 08:48 PM IST

‘మహిళల కోసం బస్సులు ఆపాలి’

PLD: సత్తెనపల్లిలో మహిళా ప్రయాణికులను గమనించి బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సమన్వయకర్త డా. గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. సాయంత్రాల్లో మహిళలు వేచి ఉన్న చోట్ల బస్సులు ఆపకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఫ్రీ బస్ పథకం సక్రమంగా అమలు కావాలని కోరారు.

April 16, 2026 / 08:45 PM IST

మెగా జాబ్ మీద పోస్టర్ ఆవిష్కరణ

ప్రకాశం: ఈ నెల 20న మార్కాపురంలోని బీ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జరుగునున్నది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆవిష్కరించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 16, 2026 / 08:45 PM IST

ఈనెల 26లోగా ఆకివీడు వార్డుల పునర్విభజన

W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను ఈనెల 26లోపు పూర్తి చేస్తామని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. 2011 జనాభా లెక్కలు, ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డులో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారని, త్వరలోనే టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

April 16, 2026 / 08:34 PM IST

తెలంగాణ సీఎంను కలిసిన ఎమ్మెల్యే

ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఆయనను కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ అంశాలపై చర్చ సాగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను ఇరువురు నేతలు స్వాగతించారు.

April 16, 2026 / 08:30 PM IST

పారిశుధ్యంపై కమిషనర్ ఫోకస్

GNTR: పట్టణంలోని 31, 28 వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పరిశీలించారు. కాలువల శుభ్రత, నీటి పంపుల తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. చెత్తను తడి, పొడిగా వేరు చేయాలని, మురుగు పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను కూడా స్వీకరించారు.

April 16, 2026 / 08:29 PM IST

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ బదిలీ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జి.శ్రీనివాస్‌ను కొత్త కమిషనర్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన కమిషనర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 16, 2026 / 08:20 PM IST

‘అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలి’

ASR: అరకులోయ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామికి సూచించారు. 

April 16, 2026 / 08:15 PM IST

జనగణనలో భాగస్వాములుకండి: ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి, జనాభా గణన-2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో స్వయం నమోదు ప్రక్రియలో తన వివరాలు నమోదు చేశారు. ఏప్రిల్ 17–30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొబైల్ ద్వారా 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో సంక్షేమం పారదర్శకంగా అందుతుందని చెప్పుకొచ్చారు.

April 16, 2026 / 08:15 PM IST

సింహాచలం చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

VSP: సింహాచలం చందనోత్సవం నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రీజినల్ మేనేజర్ సి.బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొండపై ఏర్పాట్లను పరిశీలిస్తూ ట్రాఫిక్, రద్దీ నిర్వహణపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.

April 16, 2026 / 08:14 PM IST

‘రీ-సర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యం’

SKLM: రీ-సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారమే ధ్యేయం అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదు పై క్షేత్రస్థాయిలో ఆయన సమీక్షించారు. ఇందులో RDO ప్రత్యూష, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

April 16, 2026 / 08:13 PM IST