ELR: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్ళకుండా చూడాలన్నారు.
E.G: జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మీ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిట్ & రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. రెవెన్యూ & పోలీసు అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.
PLD: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో కీ.శే. చిలకపాటి భరద్వాజాచార్యుల అకాల మరణంపై నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి సేవలను గుర్తుచేసుకున్నారు.
కోనసీమ: మురముళ్ల శ్రీవీరేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1 వరకు జరుగుతాయని ఆలయ ఏసీ సత్యనారాయణ శనివారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6:45 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. మే 1న ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీపుష్ప యాగం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30న నరసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి.
NLR: కోవూరు MLA ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని లాబొరేటరీ ఫార్మసీ స్టోర్, ఆఫీసు రూమ్లను సందర్శించారు. అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, వైద్య సేవల రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానానికి ఓ కుటుంబం విరాళాన్ని అందజేసింది. విజయవాడ ప్రసాదంపాడు ప్రాంతానికి చెందిన జీ. శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆలయ అన్నదాన పథకానికి రూ. 1,01,116 విరాళంగా అందించారు.
W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మా దాయశాఖ డిప్యూటీ కమిషనర్ DVL రమేష్ బాబు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి కళ్యాణం మహోత్సవములు సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఉప కమిషనర్ V. హరి సూర్య ప్రకాష్, V. వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు ఉన్నారు. ఆలయ EO వారికి స్వాగతం పలికారు.
కోనసీమ: రాజోలు మండలం శివకోటి గ్రామంలో “అమరజీవి – జలధార వాటర్ గ్రిడ్” పథకంలో భాగంగా 40 KL సామర్థ్యం గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (OHBR), 250 KL సంపు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
BPT: థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్–2026 అథ్లెటిక్స్ పోటీల్లో బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 5 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ విజేతలను అభినందించి, పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెడల్స్తో ఘనంగా సత్కరించారు.
KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంతో సమస్య మరింత తీవ్రం అయింది. బోర్లు కూడా సరిపడ నీరు ఇవ్వడం లేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
KDP: పులివెందులకు కృష్ణా జలాలను రప్పించిన ఘనత పూర్తిగా టీడీపీ ప్రభుత్వానిదేనని పులివెందుల మార్కెట్ యార్డు ఛైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.
SKLM: వైసీపీ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పుంజుకుని రికార్డు స్థాయిలో వృద్ధి సాధించిందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు.
NDL: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా కేంద్రం నంద్యాలలో శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10 రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంది. చిన్నారులు, తల్లులతో పాటు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ సోకకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం బెలుం ZPHS పాఠశాలలో వంటగది నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో అపరిశుభ్రత, అరకొర వసతుల మధ్యనే రేకుల షెడ్డులో నిర్వాహకులు వంటలు తయారుచేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. గత YCP హయాంలో వంటగది నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, ఐదేళ్లయినా నిర్మాణం పూర్తి దశకు చేరుకోలేదు. దీనిపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.