• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీఎం సూర్య ఘర్ యోజన ఉత్సవ్‌ను ప్రారంభించిన కలెక్టర్

E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం SC, ST ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. SC, ST కుటుంబాల విద్యుత్ ఖర్చులు తగ్గించడం, స్వయం సమృద్ధిని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

April 8, 2026 / 01:29 PM IST

సచివాలయాల్లో తనిఖీ చేసిన ఎంపీడీవో

SKLM: పొందూరులోని మొదలవలస సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వాసుదేవరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు ఫైళ్లను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ సర్వే, ఇంటి పనులు చెల్లింపు మొదలగు వివరాలను పరిశీలించి సిబ్బందికి నిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారి పాలన విషయం గురించి చర్చించారు

April 8, 2026 / 01:24 PM IST

పెసలదిన్నెలో నీటి భద్రత కార్యక్రమం

KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామంలో నిర్వహించిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో MLA బీవీ పాల్గొన్నారు. చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమం 4 దశల్లో అమలవుతుందని, మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, చివరి దశలో 5 రోజుల్లో రిపోర్టింగ్ ఉంటుందన్నారు

April 8, 2026 / 01:22 PM IST

రోడ్డు పక్కనే చెత్త కుప్పలు

VZM: సీతానగరం మెయిన్ రోడ్డుకు ఆనుకుని చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసరాలు అధ్వానంగా స్థితికి చేరుకున్నాయి. గ్రామంలో సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పడేస్తుండటంతో కుప్పలు పెరిగి, దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఈ దారిలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. తక్షణమే చెత్తను శుభ్రం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

April 8, 2026 / 01:15 PM IST

నెల్లూరు జిల్లాలో SIల బదిలీలు రద్దు..?

నెల్లూరు జిల్లాలో ఇటీవల పదిమంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు 4వ తేదీన ఎస్పీ అజిత వేజెండ్ల పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా అంతమంది పోలీసులను బదిలీ చేయడం, చివరకు ఆర్డర్స్ రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది.

April 8, 2026 / 01:14 PM IST

ముసిడిపాలెం ప్రత్యేక అధికారిగా సోమశేఖర్

AKP: ముసిడిపాలెం పంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల ఇంజనీరు సోమశేఖర్‌ను టీడీపీ నాయకులు లగుడు శ్రీనివాసరావు, రుత్తల రమణమ్మ, లగుడు గోవిందు సత్కరించారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని సోమశేఖర్ హామీ ఇచ్చారు.

April 8, 2026 / 01:13 PM IST

నందమూరి బాలకృష్ణను కలిసిన హనుమప్ప

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి బాలకృష్ణకు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులపై ఇరువురు కాసేపు చర్చించారు.

April 8, 2026 / 12:53 PM IST

చెరువుల పనులకు రూ.2.45 కోట్లు మంజూరు

ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని 13 చెరువులు, కుంటల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కట్టలు, తూముల మరమ్మతులు చేపట్టి, వర్షపు నీటిని నిల్వ చేయడమే దీని లక్ష్యం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది.

April 8, 2026 / 12:53 PM IST

పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించిన సీపీ

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కప్పరాడ వద్ద పోలీస్ అవుట్ పోస్టును సీపీ శంఖబ్రత బాగ్చి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బుధవారం ప్రారంభించారు. విశాఖ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకై ఈ అవుట్ పోస్ట్ దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ-2 మేరీ ప్రశాంతి, సీఐ రవికుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు.

April 8, 2026 / 12:52 PM IST

మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం

BPT: చెరుకుపల్లి మండలం గూడవల్లిలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ADA లక్ష్మి, జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణ పాల్గొన్నారు. రబీ 2025-26కు సంబంధించి కనీస మద్దతు ధరకు ఇక్కడ పంటలు కొనుగోలు చేస్తారన్నారు. ప్రభుత్వం క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ.8,768 కనీస మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు.

April 8, 2026 / 12:52 PM IST

రెండు నెలలు చేపల వేట నిషేధం

SKLM: ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండగా, 11 మండలాల పరిధిలో 1,565 మెకనైజ్డ్ బోట్లు, 2557 సంప్రదాయ పడవలు ఉన్నాయి. మత్స్యకారులకు రూ. 20 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.

April 8, 2026 / 12:52 PM IST

ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న ఇంఛార్జ్

E.G: రాజమండ్రి స్టేడియం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బుధవారం పాల్గొన్నారు. ఈ మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలారి శ్రీను, రామేన మోహన్, జనసేన వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

April 8, 2026 / 12:51 PM IST

‘జీడి మామిడి రైతులను ఆదుకోవాలి’

AKP: జీడిమామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై. పాపారావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పూత దశలో పొగమంచు ప్రభావం, ప్రస్తుతం వర్షాలతో నష్టాలు పెరిగాయని, ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 12:50 PM IST

తల్లిపాల బ్యాంక్ సేవలు అమోఘం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై సేవలను పరిశీలించారు. ఇప్పటి వరకు 480 లీటర్ల పాలు సేకరించి, 4 వేల మంది చిన్నారులకు అందించడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.

April 8, 2026 / 12:43 PM IST

ఎమ్మెల్యే ను కలిసిన ఎస్సై

ELR: బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై గా నూతన బాధ్యతలు స్వీకరించిన పి. చెన్నారావు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు..

April 8, 2026 / 12:42 PM IST