Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. పవన్ వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసంగా ఉన్నారు. దీంతో అనరోగ్యానికి గురయ్యారు. పెదఅమిరంలో గల నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ అస్వస్థతకు గురవడంతో ఈ రోజు నిర్వహించే కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఉదయం 10 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశం కావాల్సి ఉండేది. ఆ భేటీ మధ్యాహ్నం తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారు. పవన్ ఆరోగ్యం కుదటపడితే.. ఈ రెండు కార్యక్రమాలు జరుగుతాయి.