KRNL: గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవానికి ఆదివారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీ.వి జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దర్గా వద్ద పీఠాధిపతులు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికి, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
VZM: జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ చైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 25, 26వ తేదీలలో జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నారు.
PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా తయారవ్వాలని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం సుధారాణి తెలిపారు. ఆదివారం వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలలో రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని పేర్కున్నారు.
W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ప్రారంభించారు. పోషకాహార లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
VZM: గరివిడిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడి వేడిగా సాగింది. ఎంపీడీవో సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూరియాపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అధిక ధరలకు ప్రైవేట్ షాపులు అమ్ముతున్నారని ఆరోపించారు.
అన్నమయ్య: మదనపల్లెలో బాలికల వసతి గృహంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై.. పిల్లలందరికీ హ్యాపీ సండే పై వివరించి, ఆదివారం హ్యాపీ సండే ప్రాముఖ్యతను ఎమ్మెల్యే పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారన్నారు.
E.G: నిడదవోలులో శ్రీరామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తబృందం ఆధ్వర్యంలో ఆదివారం 53వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.
CTR: రెట్టగుంట గ్రామంలోని శ్రీ సుందర వినాయకస్వామి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆయనకు ఘన స్వాగతం పలికిపూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆలయ అభివృద్ధికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
కడప: జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు రాష్ట్ర,పార్లమెంట్ కమిటీ నేతలు, జిల్లా పార్టీ నాయకులు హాజరయ్యారు.
కోనసీమ: రామచంద్రపురం అంకం వారి వీధి వెంకటనగర్లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టరేట్లో ఆదివారం వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, ఆన్ సెట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అటూరి మాలోల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు వీరుడు నరసింహారెడ్డి అని ఆయన కొనియాడారు.
GNTR: తెనాలిలో మ్యాట్రిమోనీ పేరుతో మహిళను మోసం చేసిన కొత్తూరులంకకు చెందిన అరవపల్లి వంశీని త్రీటౌన్ సీఐ సాంబశివరావు ఆదివారం అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు వసూలు చేసి వివాహం చేయకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. బొమ్మిడాల నగర్లోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “డాక్ సేవక్ సమ్మేళన్” కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక జిల్లా పరిషత్ పాఠశాలలో 1989,1990 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 36 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. చదివిన సమయంలో చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.