• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.

February 20, 2026 / 01:08 PM IST

జిల్లా యాదమరి సమీపంలో విషాదం

CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

February 20, 2026 / 01:08 PM IST

హైవేపై నిర్మాణ పనులు.. దుమ్ముతో ఇక్కట్లు

ASR: 516-ఈ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మట్టి పనులు చేపట్టారు. నీళ్లతో తడపకపోవడం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా గాలిలోకి లేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోకి, వాహనదారుల కళ్లలోకి దూరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.

February 20, 2026 / 01:06 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి’

CTR: వాతావరణ మారుతూ ఉందని ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణం పొడిగా మారిందన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నిల్వచేసిన ఆహారాన్ని తినటం మానుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.

February 20, 2026 / 01:05 PM IST

సీఎం చంద్రబాబుతో నెల్లూరు ఎంపీల భేటీ

NLR: అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శుక్రవారం అనంతరం ఆయనతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.

February 20, 2026 / 01:04 PM IST

తెనాలిలో వైఎస్ షర్మిల పర్యటన

GNTR: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

February 20, 2026 / 01:03 PM IST

రెండేళ్లుగా తలుపులు తెరవని జడ్పీటీసీ కార్యాలయం

SKLM: మండల కేంద్రం సారవకోట జడ్పీటీసీ వి. నాగేశ్వరమ్మ గత రెండేళ్లుగా కార్యాలయం తలుపులు తెరవకపోవడం విశేషం. ఆమె జిల్లా ప్రదేశ్ ప్రాదేశిక సభ్యురాలుగా ఎన్నికై సుమారు 5 ఏళ్ళు అవుతున్నాయని కాలం కూడా దగ్గర అవుతుందని ఆమె కార్యాలయానికి రాకపోవడం తలుపులు తెరవకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

February 20, 2026 / 01:02 PM IST

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

CTR: ఉపాధి హామీ పథకంలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను పుంగనూరు పరిధిలో చేపట్టిన పనులపై ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ సామాజిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా ఆవరణంలో కార్యక్రమం జరిగింది. సామాజిక తనిఖీల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత మేరకు తప్పిదాలు చోటు చేసుకున్నదని సామాజిక తనిఖీ బృందాలు అధికారులకు వివరించారు.

February 20, 2026 / 12:53 PM IST

జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మను కలిసిన ప్రజలు

KRNL: జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ క్యాంప్ కార్యాలయలో పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి ఒక్కరి అభ్యర్థనను శ్రద్ధగా విని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణమ్మ హామీ ఇచ్చారు.

February 20, 2026 / 12:50 PM IST

నాటు సార స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో నాటు స్థావరం స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారంతో గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేశామన్నారు. సుమారు 30 లీటర్ల నాటు సార ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 12:48 PM IST

మంత్రి చొరవతో చిన్నారికి వైద్యం

KRNL: పేదల సమస్యల పరిష్కారంలో మంత్రి టీజీ భరత్ మరోసారి చొరవ చూపారు. కర్నూలు కొత్తపేటకు చెందిన నరసింహ–శ్వేత దంపతుల కుమారుడు కార్తికేయ (9) పుట్టుకతో దివ్యాంగుడు. శస్త్రచికిత్సకు రూ.8.20 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో నిధులు మంజూరై, నంద్యాలలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.

February 20, 2026 / 12:45 PM IST

‘దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలి’

VZM: దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామజిక న్యాయం దినోత్సవం సందర్భంగా శుక్రవారం బొబ్బిలిలో దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ నిరసన తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు.

February 20, 2026 / 12:45 PM IST

గృహ నిర్మాణ పూజలో పాల్గొన్న బాలకృష్ణ దంపతులు

SS: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో జరిగిన నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దంపతులు ఇరువురు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియోజకవర్గ ప్రజల శుభకార్యాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు.

February 20, 2026 / 12:43 PM IST

హైదరాబాద్ సీపీ సజ్జన్నార్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య: రాయచోటిలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైదరాబాద్ సీపీసజ్జన్నార్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక గెస్ట్ హౌస్‌లో జరిగిన భేటీలో సీపీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలిపారు.

February 20, 2026 / 12:43 PM IST

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో ప్రసాద్

SKLM: ధర్మవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి  ప్రసాద్ రావు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందుతుందా లేదా అనే విషయంపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తెలియజేయాలని కోరారు.

February 20, 2026 / 12:42 PM IST