సత్యసాయి: నల్లమడ మండలంలోని గోపేపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన తోలేటి ప్రభావతమ్మకు చెందిన మామిడి తోట ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఏడాది పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతుకు, ఈ ఘటన తీరని వేదన మిగిల్చింది.
E.G: ఈనెల 22న రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం & క్రియాశీలక సభ్యత్వ నమోదు, పలు కమిటీల నిర్మాణం, తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కావున పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
NDL: జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శుక్రవారం మధ్యాహ్నం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కేసులు వాటి పురోగతిపై సీఐ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దన్నారు.
ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సభలో పాల్గొన్న సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక, సామాజిక, అసమానతలు, కుల, మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలన్నారు.
KDP: మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం, మాదకద్రవ్యాలను అరికడదాం – మంచి సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను శుక్రవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీలో స్వచ్ఛ రథం వెహికల్ ప్రారంభోత్సవం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్, పొడి చెత్త కొనుగోలు చేసి, చెత్త అందజేసిన వారికి బహుమతులు అందించనున్నట్లు ఎంపీడీవో పరిపూర్ణ అరుంధతి తెలిపారు.
KRNL: మంత్రాలయంలో మార్చి 1,2,3 తారీఖులలో జరిగే సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
W.G: పెనుగొండ మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KRNL: రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులతో సెన్సస్-2027 నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లు, శిక్షణ, తదితర అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో జనాభా గణనను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బీమరశెట్టి రాంకీ తెలిపారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమస్యలపై వినతులు స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పాలనపై పార్టీ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కడపకు విచ్చేసిన శైలజానాథ్ను పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్లు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ATP: తాడిపత్రిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, MLA అశ్మిత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆంజనేయస్వామి మాన్యం వెనుక రూ.4.50 కోట్లతో నిర్మించే సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అలాగే అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్, జేసీ పార్క్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టారు.
కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ గురించి ఎస్సై సుబ్రహ్మణ్యం ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిత్తూరు నగర మేయర్ S. అముద వారి నూతన స్వగృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.