ATP: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సరిపూటి రమణను అనంతపురంలో ఘనంగా సన్మానించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ టీడీపీ కార్యకర్తగా ఆయన ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో నాయకులు రమణను కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
CTR: పలమనేరు గంటవూరు బీసీ కాలనీలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు చౌడేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని.. ముక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ధర్మకర్త మురుగన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళంలో ప్రజా దర్బార్ ను శుక్రవారం ఎమ్మెల్యే కూన రవికుమార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే, సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు,గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు.
విశాఖలోని గంభీరం వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIMV)కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యూకేకు చెందిన బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల అక్రిడిటేషన్ దక్కింది. వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావానికి ఈ గుర్తింపు లభించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో కొద్ది సంస్థలకే ఈ గౌరవం లభింస్తుందన్నారు.
E.G: జిల్లాలో అనధికారికంగా పాల విక్రయాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం స్పష్టం చేశారు. కల్తీ పాలు ఘటనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల పాల ఉత్పత్తి దారులు, విక్రేతలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
TPT: రేణిగుంట పట్టణంలోని ఓల్డ్ చెక్పోస్ట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సన్రైజ్ హాస్పిటల్స్ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. తక్కువ ఖర్చుతో సేవలు అందించి పేదలకు తోడ్పడాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.
శ్రీకాకుళం సబ్-డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నామని డీఎస్పీ CH వివేకానంద శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు చేయడం నిషేధమన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులతో పాటుగా జిల్లా లోని యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పౌర వేదిక కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టెబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో పీస్ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
NDL: ఆత్మకూరు మండలం కరివేనా గ్రామంలో ఈనెల 5న ఈస్టర్ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ప్రథమ విజేతకు రూ.60000, ద్వితీయ విజేతకు రూ.50000, తృతీయ విజేతకు రూ.40000, నాలుగో బహుమతిగా రూ.30000 అందించనున్నారు. రైతులు తమ ఎద్దులతో ఈ పోటీలలో పాల్గొనవచ్చని వారు కోరారు.
KRNL: ఎమ్మిగనూరు 25వ వార్డులో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉప్పర రవి కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికులు తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలన్ని పేర్కొన్నారు.
సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నేర ప్రవృత్తి గల వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కదిరిలో గొడవలకు పాల్పడుతున్న నలుగురు యువకులను గుర్తించి, వారి నుంచి రూ.5 లక్షల చొప్పున బాండ్లను తహశీల్దార్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. బైండ్ ఓవర్ అయిన వారు భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్పోర్ట్ ఎన్ఓసీ పొందడం కష్టమవుతుందని పోలీసులు హెచ్చరించారు.
PLD: చిలకలూరిపేట ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి కాలువలో పడి ఉన్నాడు. గమనించిన 108 సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడు ఫిట్స్తో బాధపడుతూ స్పృహలో లేడని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే , తెలుగుదేశం పార్టీకి బలం అని అన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఐదు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
VSP: అమరావతి రాజధాని చట్టబద్ధత పొందిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా తెలుగు జాతి గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న ఈ రాజధానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో మౌలిక వసతులు, తాగునీరు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని కోరారు.