• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీ సీతారాముల గుడి ఏర్పాటుకు భూమి పూజ

ATP: తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 11:22 AM IST

టిఆర్ కాలనీలో కర్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

February 22, 2026 / 11:19 AM IST

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

PPM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 28 వ వార్షికోత్సవం సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సమేతంగా అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ముందుగా కమిటీ సభ్యులు, ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు.

February 22, 2026 / 11:13 AM IST

పెండ్లిమర్రిలో 3 బైకులను ఢీకొన్న కారు

KDP: పెండ్లిమర్రి సమీపంలోని భైరవగుట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కడప వైపు నుంచి వేంపల్లి వైపు వెళ్తున్న మూడు స్కూటర్లను ప్రమాదవశాత్తు వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 11:10 AM IST

పశువుల దాణా లారీని అడ్డుకున్న వైసీపీ నేత

AKP: కోటవురట్ల మండలం పాములవాక పశువైద్యశాలకు వచ్చిన పశువుల దాణా లారీని వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. లారీలో పశువుల దాణా బస్తాలను అర్హులైన YCP సానుభూతిపరులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామానికి రెండు పశువుల దాణా లారీలు రాగా వాటిని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టీడీపీ వారికి పంపిణీ చేశారని ఆరోపించారు.

February 22, 2026 / 11:10 AM IST

చిప్పగిరిలో భోగలింగేశ్వర స్వామి కళ్యాణానికి ఎమ్మెల్యే విరాళం

KRNL: చిప్పగిరిలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలూరు MLA విరుపాక్షి రూ. 50,000 విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువులని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:09 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్‌కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 11:06 AM IST

నాలుగు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.

February 22, 2026 / 11:04 AM IST

సీసీ కెమెరాల నిఘాతో ఇంటర్మీడియట్ పరీక్షలు

CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.

February 22, 2026 / 11:04 AM IST

పట్టణ అభివృద్ధికి కృషి: MLA కందుల

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.

February 22, 2026 / 11:03 AM IST

బుచ్చిలో హ్యాపీ సండే కార్యక్రమం

NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్‌లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్‌లు వేయగా మెప్మా ఆర్‌పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

‘పాత రుసుముల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలి’

E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఫీజులు తగ్గింపు అధికార పక్షం, ప్రతిపక్షం ఆమోదంతోనే జరిగిందన్నారు.

February 22, 2026 / 11:00 AM IST

రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం

ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీ భూనీలా సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 11:00 AM IST

విఘ్నేశ్వరుని నిత్యాన్నదాన పథకానికి విరాళం అందజేత

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు ఎంఎన్ సోమనాథ శాస్త్రి కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 11:00 AM IST

‘కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించండి’

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఎచ్చెర్ల కి చెందిన శ్రీ సాయి కళింగ వైశ్య సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు తమ సమాజ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమ్యూనిటీ హాలు కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

February 22, 2026 / 11:00 AM IST