తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డి పల్లె మండలంలో పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాకే గ్రామంలో చెరకు రైతు వెంకట రమణ తన బాధను చెప్పుకున్నారు. ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ చూపించి ఇబ్బందులను తెలిపారు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగ...
సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లను కాదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యవహారం, నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నోరు విప్పారు. చద...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. లోకేశ్ బస చేసిన ప్రదేశానికి వచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి రచ్చ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల...
ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ భారీ కుదుపు కుదిపింది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం బహిర్గతం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆడియోలను విడుదల చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అని నిలదీశారు. అనుమానం ఉన్న చోట తాను ఉండలేను అని ప్రకటించారు. ‘ప్రజా సమ...
కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసి...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...
మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిన...
ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని, విశాఖ రాజధాని కాబోతుందని, త్వరలో తాను కూడా షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని మొత్తం అక్కడకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అలాగే, రాజధాని అంశం సుప...
తెలుగుదేశం పార్టీ హయాంలో కరువు విలయ తాండవం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న కొన్ని వార్తా సంస్థలు ప్రచురించడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో పంటలు పండించకపోవంతో కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచే...
ఏపీ సీఎం జగన్పై మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ అభద్రతాభావంతో ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్యకేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తీసుకువస్తోందని తెలిపారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ రాజధాని వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ కాల్ రికార్డులను పరిశీలించగా నవీన్తో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. నవీన్.. సీఎం జగన్ భార్య భారతి పీఏ అని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నవీన్ పాత్రపై సీబీఐ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీచేశారు. నవీన్కు నోటీసులు ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. ...