• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో బస్‌స్టాప్ నుంచి పాఠశాల వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

February 21, 2026 / 05:42 PM IST

రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శనివారం “కొండవెలగాడ – విజయనగరం కుమ్మరవీధి రోడ్ రిసర్ఫేసింగ్” పనులకు ఆమె శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకంగా ఉన్న ఈ రహదారిని పునరుద్ధరించడం తన ప్రాధాన్యత అని తెలిపారు.

February 21, 2026 / 05:40 PM IST

‘ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యం’

E.G: నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెం గ్రామంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర వాహనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగరంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదని తెలిపారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు డ్రోన్తో నిఘా: ఎస్పీ

KKD: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP జి. బిందు మాధవ్ శనివారం తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో డ్రోన్, సోలార్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. DHMD, HHMDలతో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 05:36 PM IST

చిత్తూరులో రెండు యూనివర్సిటీలు

CTR: చిత్తూరులో త్వరలో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు.

February 21, 2026 / 05:33 PM IST

ఆలయ పనులను పరిశీలించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ ృమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని కొండపేట కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 05:32 PM IST

‘మున్సిపల్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి’

VZM: మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయు) జిల్లా కమిటీ నాయకుడు దుర్గారావు డిమాండ్ చేశారు. మోయిద జంక్షన్‌లో శనివారం జరిగిన నిరసనలో మాట్లాడుతూ.. గతంలో కుదిరిన ఒప్పందాలకు ఇప్పటివరకు జీవోలు జారీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 05:31 PM IST

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: కలెక్టర్

PPM: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సంబంధించి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరుతూ, విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’! అంటూ కలెక్టర్ విషెస్ చెప్పారు.

February 21, 2026 / 05:31 PM IST

‘ఎమ్మెల్సీ అనంతభాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’

KRNL: రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసులో సీబీఐ ఆయన భార్యను కూడా ఏ2 ముద్దాయిగా చేర్చిందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధి రంగయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థలలో సడలింపు చేస్తున్న అనంతబాబు కుటుంబంపై సీబీఐ షాక్ ఇచ్చారన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ ఐ

KDP: ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లె బస్టాండ్, కడప బస్టాండ్, తదితర ప్రాంతాలలో ప్రజలకు ఆయన దొంగతనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలను ధరించి బస్సులలో ప్రయాణించరాదన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

దుంపగడప కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

W.G: ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. గత సంవత్సరం డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేలు నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కె.సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

సోషలిజమే దేశానికి దిక్కు: సీపీఎం

TPT: సత్యవేడులో రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు, దోపిడి పెరుగుతున్నాయని, సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 05:27 PM IST

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త నగిరికంటి రమేష్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాబహుకరణ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:23 PM IST

పల్నాడు పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతం: సీఎం

PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.

February 21, 2026 / 05:21 PM IST