• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి’

KDP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆర్‌ఐవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు స్వల్ప సడలింపు ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 09:30 PM IST

బాధితులకు త్వరితగతిన న్యాయం: ఏఎస్పీ

ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:00 PM IST

‘రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం’

అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

February 21, 2026 / 09:00 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాలని డీజీపీకి ఎమ్మెల్యే ఆహ్వానం

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ ఆహ్వానించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఆయను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలని కోరారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను ఆయన వివరించారు.

February 21, 2026 / 09:00 PM IST

‘రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ ప్రారంభం’

TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:43 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి: ఎమ్మెల్యే

SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : హౌసింగ్ పీడీ

TPT: తిరుపతి హౌసింగ్ కార్యాలయంలో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పనులను వేగవంతం చేసి, నాణ్యత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

మహావీర్ సర్కిల్ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి

కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

February 21, 2026 / 08:32 PM IST

సజ్జాపురంలో అగ్నిప్రమాదం

W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

February 21, 2026 / 08:32 PM IST

గురుకుల పాఠశాలలో సంక్షేమ శాఖ అధికారులు తనిఖీ

KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాగముని, పూర్ణచంద్రరావు శనివారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని శిథిలావస్థమైన తరగతి గదులను సందర్శించి, పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.

February 21, 2026 / 08:30 PM IST

రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.

February 21, 2026 / 08:23 PM IST

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.

February 21, 2026 / 08:23 PM IST

తిరుపతిలో స్వర్ణోత్సవ వేడుకలు

CTR: కరకంబాడి లోని Amara Raja Group ఆడిటోరియంలో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:21 PM IST

‘మధుడిలో ఆధార్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి’

సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్‌ సంబంధించిన బయోమెట్రిక్‌ అప్టేట్‌, ఐరిస్‌ స్కాన్‌, పేరు మార్పులు, ఫొటో అప్డేట్‌, పుట్టిన తేదీ మార్పు, సెల్‌ నంబరు లింక్‌, కొత్తగా ఆధార్‌ కార్డులు ప్రింట్‌ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...

February 21, 2026 / 08:20 PM IST

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:20 PM IST