TPT: చిట్టమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత డా. తంబిరెడ్డి మనోహర్ రెడ్డికి గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవలకు గాను అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెన్నైలో అవార్డు స్వీకరించిన అనంతరం శనివారం టీఎంఆర్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. కడైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రహంతుల్లా పాల్గోన్నారు.
కృష్ణా: మచిలీపట్నం ఆటో డ్రైవర్లకు శక్తి టీం ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, తగు సూచనలు చేశారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆదేశించారు. యార్డులో పాలకవర్గంతో నిర్వహించిన సమావేశంలో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. చీనీ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కష్టపడి పంట తెచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 11,987 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు మంజూరైనట్లు తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తామని తెల...
KRNL: గుత్తి మండల కరటికొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ఆచారి అనే వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన ఆయన తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
PPM: రైతుల ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం, ప్రభుత్వ లక్ష్యాలను అమలుపరుస్తూ నిరంతరం సేవ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చలేక పోతుందని ఎఐటీయుసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు.
VSP: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఒక శాతం కార్పొరేట్ల వద్ద పోగుపడిన సంపదపై పన్నులు వేసి ప్రజలకు పునర్వినియోగం చేయాలని పేర్కొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం CPM భవనంలో రెడ్ బుక్స్ డే సందర్బంగా లెనిన్ రచించిన పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే పుస్తకం మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ సూర్యారావు మాట్లాడారు. 21-2-1848,లో మార్క్స్ & ఎంగిల్స్ కలసి రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదల చేసిన రోజున ప్రపంచంలోని పెట్టుబడి దారి విధానానికి ఒక భూకంపం వచ్చిందన్నారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం స్వచ్ఛ రథం అని పేరు పెట్టారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల అన్నారు. శనివారం రాజుపాలెం నందు స్వచ్ఛ రథం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వచ్ఛ రథం ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ పనికిరాని వ్యర్థలను సేకరిస్తుందని.
కృష్ణా: మచిలీపట్నం మండలం మేకవానిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల చెక్కును మల్లేశ్వరరావు సతీమణి పుష్పారాణికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VZM : గజపతినగరం మండలంలోని కొత్త బగ్గం గ్రామంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దాన చంద్రరావుకు చెందిన గడ్డివాము కాలిపోయింది. సుమారు 20 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ రవి ప్రసాద్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.
అన్నమయ్య: రాజాంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పై టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ నిధులను ఎమ్మెల్యే సొంత ఎస్టేట్ పనులకు వినియోగించారని ఆయన విమర్శించారు. అకేపాడు 56/1 సర్వే నెంబర్లో టీటీడీ నిధులతో నిర్మించిన కల్యాణమండపం ఇప్పటికీ ఎస్టేట్ ఆవరణంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు.
E.G: ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ శనివారం సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా ఉంటుందన్నారు.
NDL: ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఫీజు. ఏప్రిల్ 27న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.
W.G: కాళ్ళ మండలం ప్రాతల్లమెరక గ్రామంలో వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో రూ 3 కోట్ల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, బాపట్ల ఎంఎల్ఏ , APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారని ఆయన తెలిపారు.