తెలంగాణతో ఏపీలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వందే భారత్ ప్రారంభించగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు ప్రారంభమైంది.
ఏపీలో రెండు వారాల్లో 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 267 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (Health Minister Vidada Rajani) తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనన్నారు.
ఏపీ(ap)లో గత నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని జగన్(jagan) అంటూ...చంద్రబాబు(Chandrababu naidu) ఆయనకు సెల్ఫీ సవాల్(selfie challenge) చేశారు. మీరు చెప్పిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన క్రమంలో ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేసి డిమాండ్ చేశారు.
అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ మృతిచెందాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.
Minister Botsa : వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.