KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా పుట్లూరు మండలానికి చెందిన యువనేత శ్యామ్ సుందర్ రెడ్డి బెడదల నియమితులయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నేతలకు శ్యామ్ సుందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉంటూ, తమ సమయాన్ని కెరియర్ నిర్మాణంపైనే పెట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలోని గ్రంథాలయాలు, వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
NLR: బుచ్చి పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ లిట్టెర్ గవర్నెన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొని జొన్నవాడ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు చెత్తను పారిశుద్ధ కార్మికులకు అందజేయాలన్నారు.
అల్లూర: కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలుచేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించాలన్నారు. సోమవారం శింగరాళ్లపాడు, మంగళవారం లుబ్బర్తి, బుధవారం గింజర్తి, గురువారం చింతలపూడి, శుక్రవారం రోడ్డు చింతలపూడి, శనివారం లొద్దిపాకలు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు.
SKLM: ఏపీ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు ఎక్స్ గ్రేషియా శనివారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాగా, మిగిలిన 5 మంది ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని మంత్రి తెలిపారు.
GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. 189.9 కి.మీ మేర నిర్మించే ఈ రోడ్డు డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం జిల్లా వారీగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కేంద్రానికి అప్పగించారు. మిగిలిన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయనున్నారు. ప్రాథమిక సర్వేలు కొనసాగుతున్నాయి.
అన్నమయ్య: పీలేరు పట్టణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
W.G: మొగల్తూరు ఆనంద్ రొయ్యల ఫ్యాక్టరీలో శనివారం కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ కార్మికులకు ఫైర్ సేఫ్టీపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.
E.G: నల్లజర్ల మండలo పుల్లలపాడు ఎకో హోటల్ వద్ద బీట్ కానిస్టేబుల్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవికు తీవ్ర గాయాలు కాగా పోలీసులు అతన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు.
ATP: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగాధర్ భార్య 50ఏళ్ల మద్దానమ్మ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద బైలాటం ఆడుతుండగా భార్య ఉరివేసుకుందన్న సమాచారంతో హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్రాంతానికి చెందిన గౌరి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021లో ఆమెపై దాడి చేశాడు.
KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ఆలంకరించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.