W.G: దసరా ఉత్సవాల్లో భాగంగా గోరింటాడలో కొలువై ఉన్న శ్రీ దేశాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లకు ఇవాళ మట్టి గాజులతో ప్రత్యేకాలంకరణ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి గాజులు, ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.