KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ ప్రజలు ఏడాది కాలంగా పందుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో పందులు గుంపులుగా తిరుగుతూ ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని.. ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఊరికి దూరంగా పందులను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.