ప్రకాశం: పామూరు మండలంలోని కంబాలదిన్నెలో ‘స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని వైద్యులు గద్దె ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 75 మందికి జ్వరం, థైరాయిడ్, షుగర్ పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. డాక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేసే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొనాలని అన్నారు.