VSP: ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో విశాఖ ఆర్టీసీ రీజియన్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం, ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 22 వరకు బస్సుల్లో ప్రయాణించిన వారిలో 75 శాతం మంది మహిళలే ఉన్నారు. గతంలో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉండగా, ఇప్పుడు రోజుకు సగటున 3.07 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.