Viral news: సాధారణంగా నీటికోసమే బోరు వేస్తాము. కొన్ని సందర్భాలలో ఆ బోరు నుంచి ఇందన అయిల్స్ వస్తున్నాయని అప్పుడప్పుడు చదివి ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే కోనసీమలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడటం స్థానికంగా కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గతంలో గ్యాస్ కోసం సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేశారని, రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారని స్థానికలు తెలిపారు. అయితే క్రమంలోనే భూమిలోని గ్యాస్ బయటికి వచ్చి ఉంటుందని, ఇక భూమి లోపల ఉన్న రాళ్ల రాపిడి వలన మంటలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ పైప్లైన్ అయితే గ్యాస్ను నిలిపివేసి మంటలను ఆపేవాళ్లమని, ఇది నిరంతరంగా భూమి నుంచి వస్తున్న గ్యాస్ కావడంతో దీన్ని అదుపు చేయడం కష్టంగా మారిందని వారు వెల్లడించారు.