కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మచిలీపట్నంలో మంత్రి నివాసంలో స్పీకర్ కలిశారు. ఇటీవల కొల్లు సోదరుడు కొల్లు వెంకట రమణ అకాల మరణం పట్ల సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అయ్యన్నపాత్రుడిని శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.