CTR: పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా ఆరిఫా షేక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కుప్పం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్గా ఉన్న ఆమె సీనియర్ విల్ జడ్జ్గా పదోన్నతి పొంది పుంగనూరుకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్న కేశవులతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.