SKLM: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రారంభించిన ఆస్పిరేషనల్ బ్లాక్స్లో దక్షిణ భారతదేశంలోనే భామిని మండలం అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో ఈ సూచికల సాధనను విశ్లేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందినట్లు కలెక్టర్ తెలిపారు.