బాపట్ల: చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటీపీలు, డెబిట్ కార్డుల నెంబర్లు చెప్పవద్దన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు.