ELR: తుఫాన్ తీవ్రమవుతున్న సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు మంగళవారం రాత్రి 11 గంటలకు టీ నర్సాపురం, పోలవరం, ముదినేపల్లి మండలాల నుంచి గ్రామస్థులు సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులకు, నాయకులకు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు భయపడవద్దని తుఫాను తీవ్రత తగ్గిపోతుందన్నారు