GNTR: గుంటూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని సీఐ వీరయ్య తెలిపారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఆర్సీ బుక్ కలిగి ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.