బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెంచుకుంటూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అక్టోబర్ 28న “మోన్థా” అనే తీవ్ర తుఫాను రూపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంత జిల్లాలన్నింటికీ సీనియర్ అధికారులను నియమించారు. ఏలూరు జిల్లాకు కాంతిలాల్ డాండేను నియమించారు.