NDL: ముస్లిం సోదర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి NMD ఫరూక్ శుభవార్త చెప్పారు. రంజాన్ మాసం పురస్కరించుకొని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు పనివేళల కంటే ఓ గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అటు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబుకు ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.