ASR: పాడేరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు.