ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రభుత్వం తక్షణం రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు సీపీఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా పాలక పార్టీలు ప్రాజెక్టును ఓటు బ్యాంకుగా మలుచుకుని లబ్ధి పొందుతున్నాయే తప్ప పూర్తి చేయలేదన్నారు.