PLD: జర్నలిస్టు జగన్ రెడ్డిని హత్య చేసిన దోషులను శిక్షించాలంటూ ఏపీయూడబ్ల్యూజే పెదకూరపాడు ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల అధ్యక్షులు మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాయగలిగే జర్నలిస్టులను బెదిరింపులు, ప్రాణాలు తీసిన దోషులను శిక్షించాలన్నారు. ఈ మేరకు తహసీల్దార్ ధనలక్ష్మికి వినతి పత్రం అందించారు.