KRNL: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు 9 ఏళ్లుగా పూర్తికాక నంద్యాల జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. తక్షణమే గండి పూర్చాలని డిమాండ్ చేస్తూ.. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. అసమర్ధతకు బాధ్యులైన జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.