W.G: కేంద్ర రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వశిష్ట గోదావరిపై ఆచంట మండలం కోడేరు నుంచి తూర్పుగోదావరి గన్నవరం కలుపుతూ వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంతో లంక గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని అన్నారు.