సత్యసాయి: చేన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఐచర్ను ఢీకొని బోల్తా పడిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతరాలు సురక్ష (30)గా గుర్తించారు. ఆమె తన భర్త, మూడేళ్ల కుమార్తెతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు.