ATP: తాడిపత్రి పట్టణ రూరల్ పరిధిలోని లాడ్జీలలో పోలీసులు ఆదివారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ ఎస్సై శివగంగాధర్ రెడ్డి సిబ్బందితో కలిసి లాడ్జీలను పరిశీలించారు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.